‘మహానటి’ మూవీ చూసి మెస్మరైజ్ అయిన దీపికా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె, తెలుగు మూవీ ‘మహానటి’కి ఫిదా అయింది. ఇటీవలే ఈ చిత్రం చూసిన ఆమె.. ఇన్స్టా వేదికగా తన ఒపినియన్ పంచుకుంది. ” ఇప్పుడే ఈ సినిమా చూడండి” అంటూ ‘మహానటి’ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై స్పందించిన ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. “వేకువజామున కూల్ నోటిఫికేషన్తో నిద్రలేచా” అని పేర్కొన్నారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్ సావిత్రి లైఫ్ స్టోరీ ఆధారంగా తీసిన […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె, తెలుగు మూవీ ‘మహానటి’కి ఫిదా అయింది. ఇటీవలే ఈ చిత్రం చూసిన ఆమె.. ఇన్స్టా వేదికగా తన ఒపినియన్ పంచుకుంది. ” ఇప్పుడే ఈ సినిమా చూడండి” అంటూ ‘మహానటి’ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనిపై స్పందించిన ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. “వేకువజామున కూల్ నోటిఫికేషన్తో నిద్రలేచా” అని పేర్కొన్నారు.
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్ సావిత్రి లైఫ్ స్టోరీ ఆధారంగా తీసిన బయోపిక్ ‘మహానటి’. కీర్తి సురేశ్..సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంస్థలు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. 2018లో రిలీజైన ఈ సినిమా..సంచలన విజయాన్ని నమోదు చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటూ అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. ఈ మూవీలో అద్బుతంగా నటించింనందుకుగానూ కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం అందుకుంది. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘మహానటి’ని ప్రదర్శించారు. దీపిక.. ప్రజంట్ లాక్ డౌన్ సమయంలో తన భర్త రణ్వీర్ సింగ్తో కలిసి ముంబయిలోని ఇంట్లోనే ఉంటోంది. ఈ సమయంలో పలు సౌత్ ఇండియన్ మూవీస్ చూస్తూ..అభిప్రాయాలు పంచుకుంటుంది.