Official: ప్రభాస్ సరసన దీపికా.. సెట్టైన క్రేజీ కాంబో
మాటిచ్చినట్లుగానే ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్ వెల్లడించింది వైజయంతీ మూవీస్. ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే ఖరారు అయ్యింది
మాటిచ్చినట్లుగానే ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్ వెల్లడించింది వైజయంతీ మూవీస్. ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే ఖరారు అయ్యింది. ఈ విషయాన్ని వైజయంతీ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. దీనిపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ”కింగ్కి సరిపోయేంత క్వీన్ కావాలి కదా మరి. చాలా ఆలోచించి తీసుకున్నా ఈ నిర్ణయాన్ని. పిచ్చెక్కిద్దాం” అంటూ కామెంట్ పెట్టారు.
కాగా సోషియో ఫాంటసీ కథాంశంతో ప్రభాస్ 21 తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హీరోయిన్లుగా పలువురి పేర్లు వినిపించాయి. అందులో దీపికా పేరు కూడా ఉంది. ఇక ఆ మధ్యన మహానటి సినిమా గురించి దీపికా స్పందించడంతో.. ప్రభాస్ సరసన హీరోయిన్గా ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ దీపికాను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. మొత్తానికి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న జంట ఈ మూవీలొ జోడీ కట్టబోతుండగా.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మరోవైపు దీనిపై దీపికా స్పందిస్తూ.. ”థ్రిల్లింగ్కు మించి ఫీల్ అవుతున్నా. అద్భుతమైన జర్నీ కోసం వెయిట్ చేస్తున్నా” అని కామెంట్ పెట్టారు.
King ki saripadentha Queen kavali kada mari…chaala alochinchi teesukunna decision idi…pichekkicheddam..? #Prabhas21 #DeepikaPadukone #PrabhasNagAshwin #DeepikaPrabhas https://t.co/hwElHkKapG
— Nag Ashwin (@nagashwin7) July 19, 2020
Beyond Thrilled!Cannot wait for what we believe is going to be an incredible journey ahead…❤️❤️❤️#DeepikaPrabhas@nagashwin7 @VyjayanthiFilms #Prabhas https://t.co/ckUu3vjadu
— Deepika Padukone (@deepikapadukone) July 19, 2020