పొగరాయుళ్లకు చెక్ పెట్టిన కరోనా

పొగ తాగే వారిని ఆ అలవాటు నుంచి మాన్పించడం అంత ఈజీ కాదు. పొగ తాగడం మంచిది కాదంటూ వారిలో ఎంత అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా

పొగరాయుళ్లకు చెక్ పెట్టిన కరోనా
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2020 | 7:40 AM

Smoking decreased India: పొగ తాగే వారిని ఆ అలవాటు నుంచి మాన్పించడం అంత ఈజీ కాదు. పొగ తాగడం మంచిది కాదంటూ వారిలో ఎంత అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా వారు అంత సులభంగా తమ అలవాటును వదులుకోలేరు. అయితే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మాత్రం వారికి చెక్ పెట్టగలిగింది. పొగ తాగే వారికి కరోనా సోకితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో.. చాలా మంది ఈ అలవాటును వదులుకుంటున్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు చాలా మంది పొగ అలవాటును మానుకున్నట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఫౌండేషన్ ఫర్ స్మోక్- ఫ్రీ వరల్డ్ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో చాలా మంది పొగకు దూరంగ ఉన్నట్లు తేలింది.

ఆ సర్వే వివరాల ప్రకారం లాక్‌డౌన్ ‌ సమయంలో 72% మంది పొగ తాగడం మానేయాలని నిర్ణయం తీసుకున్నారు. వారిలో 66% మంది మానేశారు.  18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో 72% మంది.. 25 నుంచి 39 ఏళ్ల వయస్సున్న వారిలో 69% మంది పొగతాగడానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్‌లీంగ్‌ ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించగా.. వారిలో ఎక్కువగా పొగతాగే వారేనని తేలింది. పొగ పీల్చినప్పుడు కరోనా వైరస్‌ నేరుగా, వేగంగా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. చైనా, ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగతాగేవారేనని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

Read More:

అరటి ఎగుమతులు.. టాప్‌లో ఏపీ

పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రైవేటు సంస్థ‌ల‌ చేతికి !