కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 40మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. పెళ్లి వేడుకలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 40మంది మృతి చెందగా.. వంద మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. స్థానిక సమాచారం ప్రకారం శనివారం రాత్రి 10.40గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు ఓ అధికారి వెల్లడించారు. కాగా ఈ వేడుకకు దాదాపు వెయ్యిమంది హాజరు అయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంకా ఏ ఉగ్రసంస్థ […]

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి..  40మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2019 | 7:39 AM

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుడుతో ఉలిక్కిపడింది. పెళ్లి వేడుకలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 40మంది మృతి చెందగా.. వంద మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. స్థానిక సమాచారం ప్రకారం శనివారం రాత్రి 10.40గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్లు ఓ అధికారి వెల్లడించారు. కాగా ఈ వేడుకకు దాదాపు వెయ్యిమంది హాజరు అయినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంకా ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. ఇదిలా ఉంటే తాలిబన్లతో పాటు స్థానిక ఉగ్ర సంస్థ తరచుగా ఆప్ఘనిస్తాన్‌లో దాడులకు పాల్పడుతుంటాయి.