ఢిల్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి పంత్…!
ఢిల్లీ ఫ్యాన్సుకు గుడ్ న్యూస్ లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. తొడ కండరాల గాయం నుంచి పంత్ పూర్తిగా కోలుకున్నాడు...
DC Wicket Keeper Rishabh : ఢిల్లీ ఫ్యాన్సుకు గుడ్ న్యూస్ లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. తొడ కండరాల గాయం నుంచి పంత్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ రోజు జరుగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్లో పంత్ బరిలో దిగనున్నాడు. గత వారం షార్జాలో రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో పంత్ గాయపడ్డాడు. దీంతో అతడు ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు.
ఫిజియో, ట్రైనర్ పర్యవేక్షణలో సాధన చేస్తున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిట్నెస్ పరీక్షలు పాసయ్యాడు. ప్రస్తుతం అతడు ఫిట్గా ఉన్నాడని ఢిల్లీ యాజమాన్యం తెలిపింది. టాస్ వేయడానికి ముందు తుది జట్టు ఎంపిక సమయంలో అతడి ఎంట్రీపై క్లారిటీ రానుంది. పంజాబ్తో జరిగే మ్యాచ్లోకి పంత్ రానుండటంతో జట్టు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు అన్నారు. వైద్యుల సూచనల మేరకు పంత్ వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఐపీఎల్-13 సీజన్లో నిలకడగా రాణిస్తున్న ఢిల్లీ ప్లేఆఫ్కి అడుగు దూరంలో ఉంది. ఈ రోజు జరిగే మ్యాచ్ వారికి కీలకంగా మారనుంది.