Breaking: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్.!
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దావూద్తో పాటు అతని భార్యకు కూడా కరోనా సోకినట్లు సమాచారం.
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దావూద్తో పాటు అతని భార్య మెహజబీన్కు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం అతని సిబ్బంది, పర్సనల్ స్టాఫ్ మొత్తం క్వారంటైన్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దావూద్ ఇబ్రహీం, అతని భార్య పాకిస్తాన్లోని కరాచీలో ఓ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
పాకిస్తాన్లోని కరాచీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం దావూద్కు కరోనా సోకినట్లు వస్తున్న వార్తలను మాత్రం ఖండిస్తూ వస్తోంది. కానీ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్త పూర్తిగా నిజం, దావూద్, అతని భార్య ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నారు. కాగా, 1993 ముంబై బ్లాస్టులలో దావూద్ ఇబ్రహీం ప్రధాన సూత్రధారి.
ఇది చదవండి: కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
#BREAKING – Dawood Ibrahim contracts COVID-19: top govt source.
Dawood and his wife test positive for coronavirus: top govt source.
Dawood’s personal staff and guards have been quarantined.@AnchorAnandN and @DeepakSEditor with details
Original Input: @manojkumargupta. pic.twitter.com/IA4HBchoXp
— CNNNews18 (@CNNnews18) June 5, 2020