డియర్ దగ్గుబాటి ఫ్యామిలీ..నెక్ట్స్ ఏంటి?
ఒక మాజీ సీఎంకి అల్లుడు..మరో మాజీ సీఎంకి తోడల్లుడు..మాజీ కేంద్రమంత్రి భర్త కూడా..ఇక ప్రస్తుతం అధికారంలో పార్టీలో ఉన్నారు. ఇప్పటికే ఆయనెవరో మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. తాజాగా ఏపీ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ సీజన్గా మారిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇప్పుడు ఆయన పొలిటికల్ ఫ్యూచర్ నెక్ట్స్ ఏంటి అన్న చందంగా తయారైంది. రాజకీయాలకు గుడ్ బై చెబుతారా..లేక మరోపార్టీ తీర్థం పుచ్చుకుంటారా అన్నక్వచ్ఛన్స్కి చిక్కు ముళ్లు వీడటం లేదు. వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ […]
ఒక మాజీ సీఎంకి అల్లుడు..మరో మాజీ సీఎంకి తోడల్లుడు..మాజీ కేంద్రమంత్రి భర్త కూడా..ఇక ప్రస్తుతం అధికారంలో పార్టీలో ఉన్నారు. ఇప్పటికే ఆయనెవరో మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది. తాజాగా ఏపీ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ సీజన్గా మారిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇప్పుడు ఆయన పొలిటికల్ ఫ్యూచర్ నెక్ట్స్ ఏంటి అన్న చందంగా తయారైంది. రాజకీయాలకు గుడ్ బై చెబుతారా..లేక మరోపార్టీ తీర్థం పుచ్చుకుంటారా అన్నక్వచ్ఛన్స్కి చిక్కు ముళ్లు వీడటం లేదు.
వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయంగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ కూడా పార్టీకి గుడ్బై చెప్పేశారట. ఇక అధికారికంగా దగ్గుబాటి నుంచి ప్రకటన రావడమే మిగిలింది. దగ్గుబాటి భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగనున్నారు. ఈవిషయంపై ఇప్పటికే ఆమె స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీలోనే ఉంటానని ఏలూరులో కూడా పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు.
అమెరికా నుంచి పురందేశ్వరి రెండు రోజుల కిందట హైదరాబాద్కు చేరుకున్నారు. కుటుంబ సభ్యుల సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుమారుడు హితేష్ రాజకీయ భవితవ్యం కోసమే తాను ఆలోచించానని, అయితే తన కోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దని హితేశ్ కన్నీటి పర్యంతమయ్యాడని తన ముఖ్య అనుచరులతో దగ్గుబాటి చెప్పినట్లు తెలిసింది. పరిస్థితులన్నింటినీ పరిశీలించిన తర్వాత తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటమే సమంజసమన్న నిర్ణయానికి వచ్చినట్లుగా దగ్గుబాటి చెప్పారని తెలిసింది. అలాగే ఈ పరిణామాలన్నింటినీ వివరిస్తూ సియం జగన్కు లేఖ రాయాలని దగ్గుబాటి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో దగ్గుబాటి అనుచరులు పర్చూరులో సమావేశం నిర్వహించారు. దగ్గుబాటి కాకుంటే నియోజకవర్గ ఇన్చార్జిగా గొట్టిపాటి భరత్ను నియమించాలని సమావేశంలో తీర్మానించారు. 2019లో వైసిపి టికెట్ ఆశించిన రామనాధం బాబును తిరిగి ఇన్చార్జిగా నియమిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అధిష్టానానికి తేల్చిచెప్పినట్టు సమాచారం. పర్చూరు వైసిపి ఇన్చార్జి ఎంపిక వ్యవహారం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
దగ్గుబాటి రాజకీయ సన్యాసం నేపథ్యంలో పర్చూరు ఇంచార్జ్ సీటు కోసం ఫైట్ మొదలైంది. ఎన్నికలకు ముందు వైసిపిని వీడి టిడిపిలో చేరిన రావి రామనాధం బాబుకు ఇంచార్జ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. దీంతో దగ్గుబాటి అభిమానులు ఒక్కసారిగా భగ్గుమన్నారట…దగ్గుబాటి ఓటమి కారణమైన రామనాధం బాబుకు ఇన్చార్జి పదవి ఇవ్వవద్దంటూ పెద్ద ఎత్తున పంచాయతీలు పెట్టారట…ఇన్చార్జి పదవిని గతంలో ఇన్చార్జిగా పనిచేసిన గొట్టిపాటి భరత్కు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారట…అంతే కాకుండా రామనాధం బాబుకు పదవి ఇవ్వవద్దంటూ ఓ వైసిపి కార్యకర్త పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. దీంతో పర్చూరులో ఇన్చార్జి పదవి కేంద్రంగా రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. దీంతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంలా పర్చూరు వైసిపి రాజకీయాలు మారాయి.