‘సల్మాన్ ఖాన్ కుటుంబమే అతని కెరీర్ ని దెబ్బ తీసింది’.. అభినవ్ కశ్యప్

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి బాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపింది. వరుసగా స్టార్ల తెర చాటు బాగోతాలు బయటికొస్తున్నాయి. తమ  సినిమాలతో పైకి ఎదుగుతున్న చిన్న స్టార్లను ఈ బడా హీరోలు వారి కుటుంబాలు ఎలా తొక్కిపెడతాయో..

'సల్మాన్ ఖాన్ కుటుంబమే అతని కెరీర్ ని దెబ్బ తీసింది'.. అభినవ్ కశ్యప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 16, 2020 | 4:59 PM

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి బాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపింది. వరుసగా స్టార్ల తెర చాటు బాగోతాలు బయటికొస్తున్నాయి. తమ  సినిమాలతో పైకి ఎదుగుతున్న చిన్న స్టార్లను ఈ బడా హీరోలు వారి కుటుంబాలు ఎలా తొక్కిపెడతాయో, వారి కెరీర్లను ఎలా దెబ్బ తీస్తాయో ఒక్కొక్కరు మనసులో దాచుకున్న గుట్లను బయటపెడుతున్నారు. తాజాగా 2010 లో సల్మాన్ ఖాన్ తో ‘దబాంగ్’ మూవీ తీసిన దర్శకుడు అభినవ్ కశ్యప్.. సల్మాన్ కుటుంబంపై తన ఫేస్ బుక్ లో నిప్పులు చెరిగారు. సలీం ఖాన్, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ అంతా కలిసి సుశాంత్ కెరీర్ ని దెబ్బ తీశారని ఆయన ఆరోపించారు. సుశాంత్ ని తొక్కిపెట్టాలని అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ ప్రయత్నించారని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం దబాంగ్-2 సీక్వెల్ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకోవడానికి ఈ కుటుంబమే కారణమన్నారు. తన కెరీర్ ని కూడా వారు దెబ్బ తీయాలని యత్నించారని, పైగా ఎన్నో సార్లు తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్, మెసేజులు వచ్చాయన్నారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. సుశాంత్ సింగ్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరిన అభినవ్ కశ్యప్.. బాలీవుడ్ లోని టాలెంట్ మేనేజర్లు, ప్రొడక్షన్ హౌస్ అధినేతలు ఒకరి కెరీర్ ని ఎదగనివ్వరని, పైగా వారి కెరీర్లను, జీవితాలను నాశనం చేస్తారని మండిపడ్డారు.