పెను తుఫాన్గా మారిన ‘వాయు’.. పటిష్ట భద్రత..!
గుజరాత్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. నేవీ, కోస్ట్ గార్డ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీని కూడా రంగంలోకి దింపారు. 54 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విరావళ్ తీర ప్రాంతంలో జాలర్ల కుటుంబాలను ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీచ్లలోకి జనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమ్నాథ్ ఆలయానికి కూడా భక్తులు రావద్దని అధికారులు సూచించారు. కాగా.. గుజరాత్లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వాయు […]
గుజరాత్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. నేవీ, కోస్ట్ గార్డ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీని కూడా రంగంలోకి దింపారు. 54 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విరావళ్ తీర ప్రాంతంలో జాలర్ల కుటుంబాలను ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీచ్లలోకి జనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమ్నాథ్ ఆలయానికి కూడా భక్తులు రావద్దని అధికారులు సూచించారు. కాగా.. గుజరాత్లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వాయు తుఫాన్ కారణంగా భారీగా నష్టం జరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ముందుగా రక్షణా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. గుజరాత్, విరావళ్కు వచ్చే వివిధ రైళ్లకు కూడా రద్దు చేశారు.
కాగా.. పశ్చిమ తీరం వెంట ఇంకా హై అలెర్ట్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు. తుఫాన్ ప్రభావాన్ని కేంద్రం పర్యవేక్షిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే.. తుఫాన్తో ఎటువంటి నష్టం జరగకూడదని ప్రార్థించారు మోదీ. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.