పెను తుఫాన్‌గా మారిన ‘వాయు’.. పటిష్ట భద్రత..!

గుజరాత్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. నేవీ, కోస్ట్‌ గార్డ్, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీని కూడా రంగంలోకి దింపారు. 54 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విరావళ్ తీర ప్రాంతంలో జాలర్ల కుటుంబాలను ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీచ్‌లలోకి జనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమ్‌నాథ్ ఆలయానికి కూడా భక్తులు రావద్దని అధికారులు సూచించారు. కాగా.. గుజరాత్‌లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వాయు […]

పెను తుఫాన్‌గా మారిన 'వాయు'.. పటిష్ట భద్రత..!
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 10:20 AM

గుజరాత్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. నేవీ, కోస్ట్‌ గార్డ్, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీని కూడా రంగంలోకి దింపారు. 54 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విరావళ్ తీర ప్రాంతంలో జాలర్ల కుటుంబాలను ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీచ్‌లలోకి జనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమ్‌నాథ్ ఆలయానికి కూడా భక్తులు రావద్దని అధికారులు సూచించారు. కాగా.. గుజరాత్‌లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వాయు తుఫాన్ కారణంగా భారీగా నష్టం జరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ముందుగా రక్షణా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. గుజరాత్, విరావళ్‌కు వచ్చే వివిధ రైళ్లకు కూడా రద్దు చేశారు.

కాగా.. పశ్చిమ తీరం వెంట ఇంకా హై అలెర్ట్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు. తుఫాన్ ప్రభావాన్ని కేంద్రం పర్యవేక్షిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే.. తుఫాన్‌తో ఎటువంటి నష్టం జరగకూడదని ప్రార్థించారు మోదీ. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..