ఆఫ్రికా దేశాలపై ఇదాయ్ తుపాను బీభత్సం.. వెయ్యికి పైగా మృతులు
దక్షిణాఫ్రికా : ఇదాయ్ తుపాను దక్షిణాఫ్రికా దేశాలైన మొజాంబిక్, మలావి, జింబాబ్వే దేశాలను ఛిద్రం చేసింది. గత 20 ఏళ్లలో ఇంతటి పెను విపత్తును ఎన్నడూ చూడలేదని అధికారులు తెలిపారు. తుపాన్ ధాటికి మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ ప్రకటించారు. నదులు ఉప్పొంగటంతో వరద నీరు గ్రామాలను ముంచెత్తిందని, పలు ప్రాంతాల్లో మృత దేహాలు తేలియాడుతున్నాయని సోమవారం రేడియోలో ప్రసంగిస్తూ వెల్లడించారు. ఇప్పటివరకు 84 మృత దేహాలు లభ్యమైనట్లు […]
దక్షిణాఫ్రికా : ఇదాయ్ తుపాను దక్షిణాఫ్రికా దేశాలైన మొజాంబిక్, మలావి, జింబాబ్వే దేశాలను ఛిద్రం చేసింది. గత 20 ఏళ్లలో ఇంతటి పెను విపత్తును ఎన్నడూ చూడలేదని అధికారులు తెలిపారు. తుపాన్ ధాటికి మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ ప్రకటించారు. నదులు ఉప్పొంగటంతో వరద నీరు గ్రామాలను ముంచెత్తిందని, పలు ప్రాంతాల్లో మృత దేహాలు తేలియాడుతున్నాయని సోమవారం రేడియోలో ప్రసంగిస్తూ వెల్లడించారు. ఇప్పటివరకు 84 మృత దేహాలు లభ్యమైనట్లు అధికారికంగా ప్రకటించారు. రహదారులు కొట్టుకుపోవటం వల్ల వివిధ ప్రాంతాల్లో వేల మంది చిక్కుకుపోయారని.. దీంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు.