ఆన్లైన్ లోనంటూ ఫోన్..ఆపైన చేశాడు క్రైమ్..
ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. అసలు ఒకరు మనకు ఫోన్ చేసి..తక్కువ వడ్డీకి ఎందుకు రుణాలు ఇస్తారు. ఏ కారణంగా లేకుండా మన అకౌంట్లో డబ్బు ఎందుకు జమ చేస్తారు. ఇదేమన్న త్రేతాయుగమా అంత మంచోళ్లు ఉంటారు అనుకోడానికి. ఎన్ని మోసాలు జరుగుతోన్న జనాల్లో చలనం మాత్రం రావడం లేదు. తాజాగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ మోసానికి బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..గుంటుపల్లిలో నివశించే మహేశ్ తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. […]
ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. అసలు ఒకరు మనకు ఫోన్ చేసి..తక్కువ వడ్డీకి ఎందుకు రుణాలు ఇస్తారు. ఏ కారణంగా లేకుండా మన అకౌంట్లో డబ్బు ఎందుకు జమ చేస్తారు. ఇదేమన్న త్రేతాయుగమా అంత మంచోళ్లు ఉంటారు అనుకోడానికి. ఎన్ని మోసాలు జరుగుతోన్న జనాల్లో చలనం మాత్రం రావడం లేదు. తాజాగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ మోసానికి బలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే..గుంటుపల్లిలో నివశించే మహేశ్ తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పోయిన సంవత్సరం అతడి మొబైల్గా ఓ మెసేజ్ వచ్చింది. రుణం కావాలంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఆ మెసేజ్ సారాంశం. ఇంకేముందు ధనలక్ష్మి ఫోన్ తట్టిందని ఆనందపడ్డ మహేశ్ వెంటనే ఆ నెంబర్కు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి అడగ్గానే వివరాలన్నీ చెప్పేశాడు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసిన అవతలి వ్యక్తి రూ. 12 లక్షల లోన్ మంజూరైందని చెప్పాడు. అందుకు సంబంధించిన ఫేక్ అగ్రిమెంట్ కాపీ కూడా పంపాడు. ఇక మహేశ్కి పూర్తి నమ్మకం కుదరడంతో ఇక్కడ నుంచి దోపిడి షురూ చేశారు. ఇన్కంటాక్స్ , రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అంటూ దఫాల వారీగా రూ. 27 వేలు స్వాహా చేశారు.
ఇంక ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్చాఫ్. దీంతో మహేశ్ బెజవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రోచ్ అయ్యాడు. పోలీసులు దర్యాప్తు చేసి..నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నగదు సేకరించి బాధితుడికి అప్పగించారు. మహేశ్ అదృష్టం బాగుంది కాబట్టి నిందితుడు దొరికాడు. లేకపోతే రోజు కూలీగా పనిచేసే అతడికి ఎన్ని కష్టాలు ఎదురయ్యేవి. అందుకే ఆన్లైన్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త.