కస్టమ్స్ అధికారుల్లోనూ ‘దొంగలున్నారు’, రియల్ గన్స్ ని బొమ్మ తుపాకుల్లా చూపి, ఏం చేశారంటే ?

విమానాశ్రయాల్లో దొంగ సరకులను విదేశాల నుంచి తెచ్చి అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల భరతం పట్టే కస్టమ్స్ అధికారుల్లోనూ దొంగలున్నారంటే నమ్మలేం..

కస్టమ్స్ అధికారుల్లోనూ 'దొంగలున్నారు', రియల్ గన్స్ ని బొమ్మ తుపాకుల్లా చూపి, ఏం చేశారంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 28, 2020 | 10:23 AM

విమానాశ్రయాల్లో దొంగ సరకులను విదేశాల నుంచి తెచ్చి అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల భరతం పట్టే కస్టమ్స్ అధికారుల్లోనూ దొంగలున్నారంటే నమ్మలేం.. కానీ ఇప్పుడు నమ్మాల్సిందే !  అసలైన గన్స్ ని బొమ్మ (టాయ్) తుపాకుల్లా మార్క్ చేసి వాటి దిగుమతికి ఆరుగురు కస్టమ్స్ అధికారులు సాయపడ్డారన్న సమాచారం ఎయిర్ లైన్స్ వర్గాలను షాకింగ్ కి గురి చేసింది. ముంబై ఎయిర్ కార్గో కాంప్లెక్స్ లో పని చేసే వీరి నిర్వాకమిది.. దీనిపై సీబీఐ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. తూటాలు లేని అసలైన గన్స్ ని టాయ్ గన్స్ గా చూపి వాటిని అమ్మడానికి వీళ్ళు యత్నించారట. ఇది కేవలం అవినీతి కేసే కాదని, ఇందులో భద్రతా పరమైన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవినీతి నిరోధక చట్టం, ఆయుధ చట్టం తదితర చట్టాల కింద ఈ అధికారులపై కేసులు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. 2016 లో ముంబైలోని బాలాజీ ఆటోమోటివ్ సొల్యూషన్స్ అనే సంస్థ 255 తుపాకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది.

ఈ అధికారుల సాయంతో వాటిని బొమ్మ తుపాకులుగా దాచి రహస్యంగా అమ్మడానికి ప్రయత్నించిందట. ఈ సమాచారం తెలియడంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సూచనపై సీబీఐ క్రిమినల్ కేసు పెట్టింది. మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ తో సహా మరో 5 గురు అధికారులపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్  ఉగ్రవాదుల కాల్పుల్లో భారత జవాన్లు అమరులవుతుంటే మరోవైపు సాక్షాత్తు దేశంలోని కొన్ని ప్రైవేటు సంస్థలు విదేశాలనుంచి అక్రమంగా గన్స్ ని దిగుమతి చేసుకోవడం, దీనికి కస్టమ్స్ అధికారుల తోడ్పాటు సంచలనమైంది.