ధోనీ 4వేల పరుగులు..ఐపీఎల్లో సరికొత్త రికార్డు
ధోనీ ఖాతాలో ఒకే రోజు రెండు రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్2020లో భాగంగా సోమవారం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై మొదట బ్యాటింగ్...
Dhoni Completed 4000 Runs : ధోనీ ఖాతాలో ఒకే రోజు రెండు రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్2020లో భాగంగా సోమవారం రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై సారథి మహీ అరుదైన ఘనత క్రియేట్ చేశాడు. చెన్నై తరఫున ధోనీ 4వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. 2008 సీజన్ ఆరంభం నుంచి రెండేండ్లు మినహా ధోనీ చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే టీమ్ తరఫున 4వేల పరుగులు సాధించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్లో ఇప్పటి వరకు 200 మ్యాచ్లు ఆడిన ధోనీ 4590కిపైగా పరుగులు పూర్తి చేశాడు. అందులో 23 అర్ధశతకాలు ఉన్నాయి. లీగ్లో అత్యధిక స్కోరు 84. సుదీర్ఘకాలంగా జట్టుకు తరఫున ఆడుతున్న మహీని చెన్నై అభిమానులు ముద్దుగా ‘తాలా’ అంటూ పిలుచుకుంటున్నారు.