ఢిల్లీతో కూడా ధోనీ సేన ఓటమి
ధోనీ జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. దుబాయి వేదికగా ఢిల్లీతో తలపడిన తన మూడో టీ20లో 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది.
ధోనీ జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. దుబాయి వేదికగా ఢిల్లీతో తలపడిన తన మూడో టీ20లో 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్(43/35 బంతుల్లో 4ఫోర్లు), కేదార్ జాధవ్(26/ 21 బంతుల్లో 3ఫోర్లు) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు.
ఓపెనర్లు మురళీ విజయ్(10), షేన్వాట్సన్(14) ఆదిలోనే ఇంటిదారి పట్టారు. వారి ప్రదర్శన మరోసారి విఫలమయ్యారు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్(5) కూడా అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. దీంతో చెన్నై 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకలలోతూ కష్టాల్లోకి వెళ్లిపోయింది.
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్, కేదార్ జాధవ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. చివర్లో కెప్టెన్ ధోనీ(15 పరుగులు) క్రీజులోకి వచ్చినా అప్పటికే టార్గెట్ కొండంతగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నై ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమిచెందింది. దిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ మరో వికెట్ తీశాడు.
అంతకుముందు – టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు చెలరేగి ఆడటం జట్టు విజయానికి కలిసి వచ్చింది. పృథ్వీషా 43 బంతుల్లోనే 64 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 35 రన్స్ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 10.4 ఓవర్లలో 94 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే.. ఆ తర్వాత వరసగా ఇద్దరు ఔటయ్యారు. ఆ తర్వాత రిషభ్ పంత్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమదైన శైలిలో బ్యాటింగ్ చేశారు. దీంతో ఢిల్లీ టీమ్ స్కోరు పరుగులు పెట్టింది. చెన్నై బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు.