బీజేపీ ర్యాలీపై నాటుబాంబులతో దాడి.. నలుగురికి గాయాలు..
వెస్ట్ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేతలు తలపెట్టిన ర్యాలీపై దుండగులు నాటుబాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బరాక్పొరలో..
వెస్ట్ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేతలు తలపెట్టిన ర్యాలీపై దుండగులు నాటుబాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని బరాక్పొరలో బీజేపీ ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అయ్యింది. అయితే ర్యాలీ ప్రారంభమవుతుందన్న ముందే.. కార్యకర్తల గుంపుపై దుండగులు నాటుబాంబులు విసిరి పరారయ్యారు. శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. నాటుబాంబుల దాడిలో నలుగురు కార్యకర్తలు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కూడా హాజరయ్యారు. ఇటీవల బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా ఈ స్థానికంగా ఈ ర్యాలీ చేపట్టారు.
కాగా, ఈ నెల 5వ తేదీన అర్జున్ సింగ్ కారుపై నార్త 24 పరగాణాలో దుండుగులు దాడి చేశారు. అయితే ఆ సమయంలో ఆయన కారులో లేరు. ఈ ఘటనకు పాల్పడింది టీఎంసీ కార్యకర్తలేనంటూ బీజేపీ ఆరోపించింది.