కరోనాకు భయపడిపోయా.. అందుకే చనిపోతున్నానంటూ లేఖ..!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. రోజులు గడిచే కొద్ది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43లక్షలకు చేరింది. వీరిలో పదిహేను లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకుంటే.. దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వైరస్ మన దేశంలో కూడా తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. గత పది రోజులుగా కేసుల సంఖ్య అమాంతం […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. రోజులు గడిచే కొద్ది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43లక్షలకు చేరింది. వీరిలో పదిహేను లక్షలకు పైగా కరోనా నుంచి కోలుకుంటే.. దాదాపు రెండు లక్షల ఎనభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ వైరస్ మన దేశంలో కూడా తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. గత పది రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఈ క్రమంలో దేశంలోని సైనికులను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు.. బీఎస్ఎఫ్ జవాన్లకు కూడా ఈ వైరస్ సోకింది. పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే జమ్ముకశ్మీర్లోని అంనంత్ నాగ్ జిల్లాలో సీఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఫతే సింగ్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నాడు. దీంతో వెంటనే గమనించిన తొటి జవాన్లు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆత్మహత్యకు పాల్పడకముందు.. ఓ సూసైట్ నోట్ రాసిపెట్టాడు. అందులో కరోనాకు భయపడియానని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పేర్కొన్నాడు. ఘటనపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. అటు సీఆర్పీఎఫ్ అధికారులు కూడా ఘటనపై విచారణ చేపడుతున్నారు.