యూపీలో మరో ఎన్‌కౌంటర్‌..గాయాలతో పట్టుబడ్డ క్రిమినల్..

ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రిమినల్స్‌ వేట కొనసాగుతోంది. శుక్రవారం నాడు మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై క్రిమినల్స్ కాల్పులకు దిగింది తెలిసిందే. ఈ ఘటనలో..

యూపీలో మరో ఎన్‌కౌంటర్‌..గాయాలతో పట్టుబడ్డ క్రిమినల్..
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 5:14 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో క్రిమినల్స్‌ వేట కొనసాగుతోంది. శుక్రవారం నాడు మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ వికాస్ దుబేను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై క్రిమినల్స్ కాల్పులకు దిగింది తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీతో సహా.. ముగ్గురు ఎస్సైలు.. మరో నలుగురు కానిస్టేబుల్లు మరణించారు. అయితే ఈ ఘటన తర్వాత పోలీసులు క్రిమినల్స్‌ను పట్టుకోవడంపై ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గౌతమ్‌ బుద్ద నగర్‌లోని దాద్రీ పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను గుర్తించారు. పోలీసులను గమనిచించిన ఆ క్రిమినల్ తన దగ్గర ఉన్న తుపాకీతో పోలీసులపై కాల్పులకు దిగాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎదురు కాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో సదరు క్రిమినల్‌ కాలుకు బుల్లెట్‌ దిగింది. దీంతో అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్‌ డీసీపీ రాజేష్ సింగ్ స్పందించారు. గాయపడ్డ క్రిమినల్‌పై అనేక కేసులు ఉన్నాయని.. ఇతని ముఠాపై ఆరా తీస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి ఓ బైక్‌తో పాటు.. తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??