యజమాని అఘాయిత్యం.. అద్దెకున్న కుటుంబానికి మత్తు మందు ఇచ్చి గ్యాంగ్‌రేప్‌‌..

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మత్తు మందు ఇచ్చి ఓ మహిళతో పాటు ఆమె కూతురిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన చందానగర్‌ ప్రాంతంలో..

యజమాని అఘాయిత్యం.. అద్దెకున్న కుటుంబానికి మత్తు మందు ఇచ్చి గ్యాంగ్‌రేప్‌‌..
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2020 | 12:26 PM

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మత్తు మందు ఇచ్చి ఓ మహిళతో పాటు ఆమె కూతురిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన చందానగర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ 35 ఏళ్ల మహిళ తన కూతురు,కుమారుడితో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. అయితే ఇంటి యజమాని కన్ను.. ఆమెపై పడింది. దీంతో ఆమెను లోబరుచుకునేందుకు కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఆ మహిళ తినే ఆహారంలో మత్తు మంది కలిపాడు. దీంతో విషయం తెలియక ఆ ఆహారాన్ని తీసుకున్న వారు మత్తులో పడిపోయారు. దీంతో సదరు ఇంటి యజమాని.. అతడి స్నేహితులతో కలిసి.. ఆ మహిళపై, ఆమె పదిహేనేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆమె కుమారుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా.. బాధితురాలితో పాటు ఆమె కూతురిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.