అత్తను రాడ్‌తో కొట్టి చంపిన కోడలు.. అనంతరం పక్కింటి బాత్‌రూంలోకి వెళ్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..

క్షణికావేశంలో అత్తను రాడ్డుతో కొట్టి చంపిన ఓ కోడలు పక్కింటి బాత్‌రూంలోకి దూరి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌

అత్తను రాడ్‌తో కొట్టి చంపిన కోడలు.. అనంతరం పక్కింటి బాత్‌రూంలోకి వెళ్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..
Follow us

|

Updated on: Feb 22, 2021 | 5:43 AM

క్షణికావేశంలో అత్తను రాడ్డుతో కొట్టి చంపిన ఓ కోడలు పక్కింటి బాత్‌రూంలోకి దూరి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయ్‌గడ్‌ జిల్లాకు చెందిన యోగిత(32) అనే మహిళ భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. ఆమె తన ఇద్దరు పిల్లలతో అత్తారింట్లోనే ఉంటోంది. తరచూ అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరిగేవి. ఆదివారం కూడా ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగిత, అత్త తారాబాయ్‌ని ఇనుప రాడ్డుతో కొట్టి చంపింది. మామ, ఇద్దరు పిల్లల కళ్ల ముందే ఈ దారుణానికి పాల్పడింది.

విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేస్తారని భయపడిన యోగిత పక్కింటి బాత్‌రూంలోకి దూరి తలుపేసుకుంది. అనంతరం టాయిలెట్‌ క్లీనర్‌ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు బాత్‌ రూం తలుపులు బద్దలుకొట్టిచూడగా.. ఆపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు ఆసుపత్రినుంచి విడుదలైన వెంటనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.

మాట్లాడాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు.. కత్తితో పొడిచి చంపేశారు.. శామీర్‌పేట్‌లో మేస్త్రీ దారుణహత్య