అనుమానాస్పదంగా మర్రి చెట్టుకు వేలాడుతోన్నరెండు మృతదేహాలు
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్.. జవహర్ నగర్ కార్పొరేషన్లో మూడు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో మర్రి చెట్టుకు రెండు యువతుల మృతదేహాలు వేలాడుతూ..
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ కార్పొరేషన్లో మూడు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. డెంటల్ కాలేజ్ డంపింగ్ యార్డ్ సమీపంలో మర్రి చెట్టుకు ఇద్దరి యువతుల మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. అలాగే చెట్టు పక్కనే మరో ఓ చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. స్థానికుల సమాచారంతో.. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒకే చోట మూడు మృతదేహాలు కనపడటంతో స్థానికంగా కలకలం రేగుతోంది. ఇది ఆత్మహత్యనా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?
బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ