Thugs Attack: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. పది మంది దుండగుల హల్‌చల్‌.. గొంతు కోసి ఒకరి హత్య

Thugs Attack: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతూరు మండలం నర్సింగపేటలో యువకులు హల్‌ చల్‌ చేశారు. పది మందితో కూడిన ఈ ముఠా.. ఒకరి ....

Thugs Attack: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. పది మంది దుండగుల హల్‌చల్‌.. గొంతు కోసి ఒకరి హత్య
Follow us

|

Updated on: Jan 01, 2021 | 7:59 PM

Thugs Attack: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతూరు మండలం నర్సింగపేటలో యువకులు హల్‌ చల్‌ చేశారు. పది మందితో కూడిన ఈ ముఠా.. ఒకరి గొంతు కోసి హత్య చేశారు. అలాగే మరో వ్యక్తిపై కత్తితో దాడికి తెగబడ్డారు. అనంతరం ఇదే ముఠా సభ్యులు ఇద్దరు మహిళలపై కర్రలతో దాడి చేశారు. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన గురవుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా పది మంది యువకులు హల్‌ చల్‌ చేస్తూ దాడి తెగబడుతుండటం తీవ్ర సంచలనం రేపుతోంది. వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంత మంది దాడి చేయడానికి కారణాలేమై ఉన్నాయని, ముఠా సభ్యులు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. దుండగుల వద్ద మరణాయుధాలు ఉన్నట్లు బాధితులు పోలీసులకు వివరించారు.

Also Read: Agra-Lucknow Expressway: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది వాహనాలు ఢీకొని ముగ్గురు మృతి.. ఐదుగురికి గాయాలు