సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో కోర్టుకు సల్మాన్, కరణ్.. ముజఫర్పుర్ కోర్టులో పిటిషన్ దాఖలు..
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కుంభకోణంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కుంభకోణంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. తాజాగా జనవరి తొలి వారంలోగా వాదనలను వినిపించాలని బిహార్ కోర్టు సల్మాన్, కరణ్ జోహార్లను ఆదేశించింది. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ తరఫు న్యాయవాదులు కూడా వారి వాదనలు వినిపించారు.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బిహార్లోని ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్.. కొంతకాలం క్రితం ముజఫర్పుర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 306, 109, 504, 506 కింద సల్మాన్, కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, ఏక్తా కపూర్ సహ మరి కొంతమందిపై కేసు నమోదు చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడేలా వీరంతా పురికొల్పారని ఫిర్యాదు చేశారు.దీంతో త్వరగా తమ వాదనలను వినిపించాలని బిహార్ముజఫర్పుర్ కోర్టు ఆదేశించింది. రానున్న జనవరి తొలి వారంలోగా ఈ ప్రక్రియ జరగాలని ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు.. వరుసగా వీరందరీ వాదనలు వినడం ప్రారంభించింది. సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్, భూషణ్ కుమార్, సాజిద్ నడియావాలా, దినేశ్ విజయన్ తరఫు న్యాయవాదులు కోర్టు ముందు వారి వాదనలను బుధవారం వినిపించారు. కానీ సల్మాన్, కరణ్ న్యాయవాదులు మాత్రం హాజరు కాలేదు. దీంతో సల్మాన్, కరణ్ త్వరితగతిన తమ వాదనలు వినిపించాలని న్యాయస్థానం ఆదేశించింది.