బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

బీహార్‌లో ఘర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆటోలను వేగంగా వచ్చిన ఓ డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడురుగు అక్కడిక్కడే మృతి చెందగా... నలుగురు తీవ్రంగా గాయపడ్డడారు....

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
Follow us

|

Updated on: Jun 15, 2020 | 2:44 PM

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందగా…నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రెండు ఆటోలను ఢీకొట్టింది. గయా జిల్లా బిష్ణుగంజ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరంతా పక్కనే ఉన్న ఓ గ్రామంలో జరిగిన వేడుకలో పాల్గొని రెండు ఆటోల్లో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వేగంగా కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో వేడుకలకు ఎవరు అనుమతించారు… ముగ్గురు ప్రయాణించాల్సిన ఆటోలో ఆరుగురు ఎలా ప్రయాణించారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.