Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు, కారు.. ఒకరు మృతి.. 16 మందికి
Peddapalli Road Accident: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఎక్లాస్ పూర్ గ్రామ
Peddapalli Road Accident: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని ఎక్లాస్ పూర్ గ్రామ సమీపంలోని గాడిదల గండిగుట్ట అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టింది. అనంతరం ఈ రెండు వాహనాలు లోయలోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందగా.. 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బెల్లంపల్లి నుంచి వరంగల్ హన్మకొండకు వెళ్తున్న పరకాల డిపో బస్సు.. గాడిదల గండిగుట్ట అటవీ ప్రాంతంలో ఢికొట్టింది. దీంతో కారు, బస్సు రెండూ కూడా ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయాయి.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మందిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడు మంథని మండలం ఖాన్ సాయిపేట గ్రామానికి చెందిన వినీత్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: