భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్..
మహారాష్ట్ర పోలీసులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. గంజాయితో పాటు చరస్ను కూడా సీజ్ చేశారు. పుణే కస్టమ్స్ పోలీసులు పక్కా సమాచారం అందడంతో.. వాహనాలను తనిఖీలు చేపట్టారు.
మహారాష్ట్ర పోలీసులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. గంజాయితో పాటు చరస్ను కూడా సీజ్ చేశారు. పుణే కస్టమ్స్ పోలీసులు పక్కా సమాచారం అందడంతో.. వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను తనిఖీలు చేశారు. దీంతో ఆ వాహనాల్లో పెద్ద ఎత్తున గంజాయిని గుర్తించారు. రెండు వాహనాల్లో కలిపి 868 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. చరస్ అనే మాదక ద్రవ్య పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం పట్టుబడ్డ గంజాయి రూ.1.04 కోట్ల విలువ ఉంటుందని.. ఇక చరస్ విలువ రూ.0.75 కోట్లు ఉంటుందని తెలిపారు. రెండు వాహనాలతో పాటు.. నార్కోటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Maharashtra: Pune Customs intercepted and detained four persons, along with two vehicles, carrying 868 kg of ‘Ganja’ valued approximately at Rs 1.04 Crores & 7.5 kg of ‘Charas’ valued at Rs 0.75 Crores. The narcotics drugs and the two vehicles have been seized. pic.twitter.com/JPACTDxrbk
— ANI (@ANI) June 25, 2020