Accident in Ramadugu: ‘కిట్టూ.. నీ లోటు భర్తీ చేయలేం’.. రోడ్డు ప్రమాదంలో యువకుడు బ్రెయిన్ డెడ్.. అవయవాలు దానం

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్(Brain dead) అయిన యువకుడి అవయవాలను మృతుడి కుటుంబసభ్యులు దానం చేశారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని రామడుగులో ఈ ఘటన జరిగింది...

Accident in Ramadugu: 'కిట్టూ.. నీ లోటు భర్తీ చేయలేం'.. రోడ్డు ప్రమాదంలో యువకుడు బ్రెయిన్ డెడ్.. అవయవాలు దానం
Brain Dead
Follow us

|

Updated on: Feb 09, 2022 | 9:57 AM

రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్(Brain dead) అయిన యువకుడి అవయవాలను మృతుడి కుటుంబసభ్యులు దానం చేశారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని రామడుగులో ఈ ఘటన జరిగింది. ఈ నెల 6న రామడుగు(Ramadugu) మండలంలోని రంగశాయిపల్లి రోడ్డు ప్రమాదంలో గంగసాని శ్రీనివాస్‌రెడ్డి అలియాస్‌ కిట్టు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై నుంచి కింద పడటంతో తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరాడు. చికిత్స నిమిత్తం కిట్టును మొదట కరీంనగర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు.

గాయం కారణంగా కిట్టు బ్రెయిన్‌డెడ్‌ అయ్యాడని చెప్పడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అవయవదానంతో నలుగురికి సహాయం అందించవచ్చని, వారి రూపంలో కిట్టు జీవించే ఉంటాడని కుటుంబసభ్యులను వైద్యులు ఒప్పించారు. జీవన్‌జ్యోతి ట్రస్టు ఒప్పందంతో కళ్లు, అవయవాలను దానం చేశారు. సికింద్రాబాద్‌ నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చేరుకుని నివాళులర్పించారు. మృతుని మిత్రులు ఫేస్‌బుక్‌లో ‘కిట్టు… నీ లోటు భర్తీ చేయలేం’ అంటూ పంపిన సందేశాలు పలువురిని కంటతడి పెట్టించాయి.

Also Read

Meenakshi Chaudhary: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన మీనాక్షి చౌదరి

Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్ వచ్చేది అప్పుడే.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో హిట్ కొడతానంటున్న యంగ్ హీరో..

Tirumala: ఈనెల 16న తిరుమలలోని ఆకాశగంగ వద్ద హనుమాన్ జన్మస్థలం భూమి పూజ.. హ‌నుమంతుని జ‌న్మ‌వృత్తాంతంపై పుస్త‌కం విడుద‌ల