Tragedy: పండుగపూట విషాదం.. హోలీ ఆడి నదిలో స్నానానికి దిగిన ఆరుగురు గల్లంతు..
6 boys drown in Kharasrota River: హోలీ సంబరాల అనంతరం నదిలో స్నానానికి దిగిన ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మూడు మృతదేహాలను వెలికితీశారు. మరో ముగ్గురి కోసం
6 boys drown in Kharasrota River: హోలీ సంబరాల అనంతరం నదిలో స్నానానికి దిగిన ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మూడు మృతదేహాలను వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషాద ఘటన ఒడిశా (Odisha) లోని జైపూర్లో చోటుచేసుకుంది. హోలీ సంబరాల అనంతరం శనివారం ఆరుగురు బాలురు జాజ్పూర్లోని ఖరస్రోత నదిలో దిగి స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవవశాత్తు ఒకరు నీటిలో మునిగిపోతుండగా.. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఒకరి తర్వాత ఒకరు అందరూ మునిగిపోయారు. గల్లంతైన వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. హోలీ ఆడి నదిలో స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు పేర్కొ్న్నారు. మునిగిపోతున్న వారిని గమనించి రక్షించడానికి ప్రయత్నించామని, కానీ ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఆరుగురిలో ఇద్దరిని సిబ్బంది వెలికి తీయగా ఒకరి మృతదేహాన్ని మాత్రం స్థానికులు బయటకు తీశారని పోలీసులు తెలిపారు. చీకటి పడడంతో శనివారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశామని.. ఇంకా కొనసాగుతోందని తెలిపారు.
Odisha | 3 bodies recovered, 3 still missing after six boys drowned in Kharasrota river near Bandhaamunda village ghat in Jajpur’s Badasuar panchayat. We will continue with the search operation (today): Purna Chandra Marandi, District Assistant Fire Officer (19.03) pic.twitter.com/yJDqPBMnrU
— ANI (@ANI) March 19, 2022
Also Read: