Kukatpally ASI Died: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్సై మృతి..

Kukatpally ASI Died: హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి చెందారు. కొండాపూర్‌లోని

Kukatpally ASI Died: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్సై మృతి..
Kukatpally Asi Died
Follow us

|

Updated on: Mar 31, 2021 | 3:06 AM

Kukatpally ASI Died: హైదరాబాద్ నగరంలోని నిజాంపేట్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి చెందారు. కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మహిపాల్ కన్నుమూశారు. 27వ తేదీన శనివారం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారు ఢీకొనడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పుడే కారులో వస్తున్న సృజన్ అనే యువకుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీసులను చూసి వేగంగా వెనక్కు మళ్లే సమయంలో వెనుక ఉన్న మరో కారును ఢీ కొట్టాడు. మళ్లీ వెంటనే ముందుకు రానివ్వడంతో అక్కడున్న హోంగార్డుకు గాయాలయ్యాయి. ఆ తర్వాత సృజన్‌కు ఆల్కహాల్ టెస్టు చేయగా 170 రీడింగ్ వచ్చింది. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కూకట్‌పల్లి స్టేషన్‌కు సమాచారమిచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి పెట్రోలింగ్ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసులను విషయం అడిగి తెలుసుకుంటుండగా.. అటుగా వస్తున్న మరో కారు ఏఎస్సై మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది మహిపాల్ రెడ్డిని హాస్పటల్‌కు తరలించారు. తలకు తీవ్రగాయమై చికిత్స పొందుతున్న మహిపాల్ రెడ్డి రాత్రి కన్నుమూశారు.

Also Read:

Cylenders Blast: నంద్యాల చెక్‌పోస్టు వద్ద భారీ పేలుడు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

Raviprakash Arrest : మద్యం మత్తులో బైక్ నడిపి మహిళ మృతికి కారణమైన రవిప్రకాష్‌ని అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు