Crime: ముగ్గురు బిడ్డలతో బావిలో దూకిన తల్లి

పదమూడేళ్ల దాంపత్య జీవితం.. పండంటి ముగ్గురు సంతానం.. అన్యోన్యంగా సాగే కాపురం.. అనుకోని కలహం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.. తాళి కట్టినవాడి కష్టాన్ని అర్థం చేసుకోలేని ఆవేశం తనలో ఆడపిల్లలను సాకలేననే అనుమానాన్నిపెంచింది. భర్తను వదిలి పుట్టింటికి వచ్చినా భారం తగ్గలేదు. మనసు కర్కశంగా మారింది.

Crime: ముగ్గురు బిడ్డలతో బావిలో దూకిన తల్లి
Follow us

|

Updated on: Feb 24, 2020 | 9:03 PM

పదమూడేళ్ల దాంపత్య జీవితం.. పండంటి ముగ్గురు సంతానం.. అన్యోన్యంగా సాగే కాపురం.. అనుకోని కలహం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.. తాళి కట్టినవాడి కష్టాన్ని అర్థం చేసుకోలేని ఆవేశం తనలో ఆడపిల్లలను సాకలేననే అనుమానాన్నిపెంచింది. భర్తను వదిలి పుట్టింటికి వచ్చినా భారం తగ్గలేదు. మనసు కర్కశంగా మారింది. చెరువు చూపిస్తానని బిడ్డలను బావిలో తోసేసి తను కూడా ప్రాణాలు తీసుకోవాలనుకుంది. దురదృష్టం ఆమె వెంటే ఉంది….ఈ ఘటనలో తాను బతికి.. పిల్లల్ని పోగొట్టుకుంది. ఏ తల్లికీ ఎన్నడూ రాకూడని కష్టం ఆ తల్లికి వచ్చిపడింది.

పెద్దకమ్మవారిపల్లి దొమ్మరికాలనీకి చెందిన దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారైను కదిరికి చెందిన వ్యక్తితో 13 ఏళ్ల కిందట వివాహం చేశారు. వీరికి మొదటి సంతానంలో ఇద్దరు కవలలు ఆడపిల్లలు పుట్టారు. రెండో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టింది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వీరిది. భర్త ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎంతో సంతోషంగా ఉండే కాపురంలో కలతలు రేగాయి.

నాలుగు నెలల నుంచి భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడేవారు.. ఈనేపథ్యంలో 20 రోజుల కిందట ఆమె కదిరి నుంచి పుట్టింటికి పిల్లలతో కలిసి వచ్చింది. కొంతకాలంగా కవలలైన వారి పిల్లలతో కలిసి తాత అవ్వ వద్దే ఉంటూ.. పెద్దకమ్మవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో పిల్లల్ని చదివిస్తోంది. ఈ క్రమంలోనే చెరువు చూసొద్దామని ఆ తల్లి తన ముగ్గురు పిల్లలను తీసుకెళ్లింది. అక్కడే ఉన్న బావిలో ఇద్దరు చిన్నారులను ముందు తోసేసింది. అనంతరం చంటిబిడ్డతో కలిసి తానూ దూకేసింది. సమీపంలోని స్థానికులు వెంటనే బావిలోకి దిగి ఆమెను, పసిపాపను బయటకు తీశారు. చిన్నారిని సత్యసాయి జనరల్‌ ఆసుపత్రికి తరలించగా, ఆ చిన్నారి అక్కడ తుదిశ్వాస విడిచింది. తల్లి ప్రాణాలతో బయటపడింది.

కవలలైన ఇద్దరు చిన్నారుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అల్లారుముద్దుగా ఉండి, అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉండే చిన్నారుల మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రామకృష్ణయ్య పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల మృతిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబానికి సానుభూతి తెలిపారు.. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు