సినీ ఫక్కీలో సెల్ఫోన్ల భారీ చోరీ
ఆంధ్రప్రదేశ్ లో దోపిడీ దోంగలు మరోసారి రెచ్చిపోయారు. ట్రక్కును వెంబడించి మరీ చోరికి పాల్పడ్డారు. మళ్లీ నగరి సీనే గుంటూరులోనూ రిపీట్ అయింది.
ఆంధ్రప్రదేశ్ లో దోపిడీ దోంగలు మరోసారి రెచ్చిపోయారు. ట్రక్కును వెంబడించి మరీ చోరికి పాల్పడ్డారు. మళ్లీ నగరి సీనే గుంటూరులోనూ రిపీట్ అయింది. సెల్ఫోన్ దొంగల ముఠా.. సినిమా ఫక్కీలో చోరీకి తెగబడింది. గత నెలలో దోపిడీ జరిగినట్టుగానే గుంటూరులోని కాజా టోల్గేట్ దగ్గర జరిగింది. డ్రైవర్ అప్రమత్తమం అయ్యేలోపే ఓ కంటైనర్లోకి చొరబడ్డ ముఠా.. భారీ ఎత్తున సెల్ఫోన్లను ఎత్తుకెళ్లింది.
చెన్నై నుంచి కోల్కతాకు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీలో ఈ చోరీ జరిగింది. డ్రైవర్కు సమాచారం ఇచ్చి మరీ చోరీకి తెగబడ్డారు దుండగులు. వెనుక నుంచి లారీలో దొంగలు ఫాలో అవుతున్నట్టు గుర్తించిన డ్రైవర్.. అప్రమత్తం అయ్యేలోపే దొంగలు తమ పని కానిచ్చారు. దాంతో లారీ డ్రైవర్ గుంటూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. MI కంపెనీకి చెందిన సెల్ఫోన్లు పోయినట్టుగా తెలుస్తోంది. ఆగస్టులో నగరిలో జరిగిన సెల్ఫోన్ల దొంగతనంలో కూడా పోయినవి షామీ కంపెనీ సెల్ఫోన్లే. గుంటూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.