మేమంతా మీవెంటే.. కుమారుడు మరణించాడని కుటుంబమంతా సూసైడ్ చేసుకుంది
ఎనిమిది నెలల క్రితం మదన్ కుమార్ క్యాన్సర్తో మరణించాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం దిగాలుగా ఉంది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవారు కాదు.
Mass suicide in Tamil Nadu: ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరణించడంతో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంది. క్యాన్సర్తో పెద్దకుమారుడు మరణించాడని కుటుంబమంతా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తాజాగా తమిళనాడులోని సేలం జిల్లా అమ్మాపేట సమీపంలోని వలకాడులో జరిగింది. వలకాడు చెందిన మురుగన్, కోకిల దంపతులకు ముగ్గురు కుమారులు. పద్నాగేళ్ల పెద్ద కుమారు మదన్ కుమార్ కు క్యాన్సర్ వచ్చింది. వ్యాధి బారి నుంచి తమ కుమారుడిని రక్షించుకోవడానికి ఆ దంపతులు ఎంతో శ్రమించారు అయినా ఫలితం లేకపోయింది. ఎనిమిది నెలల క్రితం మదన్ కుమార్ క్యాన్సర్తో మరణించాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం దిగాలుగా ఉంది. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవారు కాదు. రోజూ తమ పెద్దకుమారుడినే తలచుకుంటూ ఏడస్తూ ఉండేవారు.
మురుగన్ సమీప గ్రామంలోని ఓ సెలూన్లో పని చేసేవారు. అయితే కొన్ని రోజులుగా మురుగన్ పనికి వెళ్లడం కూడా మానేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులూ పెరిగాయి. వీరికి మరో ఇద్దరు కుమారులు వసంతకుమార్(12), కార్తీక్(9) ఉన్నారు. అయితే ఆ ఇద్దరు కుమారులకు విషమిచ్చి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇంటి తలుపులు ఎంతకు తెరచుకోకపోవడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మురుగన్, కోకిల, వసంతకుమార్, కార్తీక్లు విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.