బీహార్‌లో ప్రైవేట్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

బీహార్‌లోని బారురాజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్డంకు తరలించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు […]

బీహార్‌లో ప్రైవేట్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు
Follow us

|

Updated on: Jun 11, 2019 | 12:36 PM

బీహార్‌లోని బారురాజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్డంకు తరలించారు. గాయపడిన వారికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.