Crime News: బిజినెస్ అంటూ గెస్ట్హౌస్కి పిలిచాడు.. నమ్మి వెళ్లిన యువతిపై దారుణం..
ఈ ఘటన గ్వాలియర్ నగరంలో బుధవారం రాత్రి జరిగింది. నిందితులను లాలా, హిమాన్షు, అభిషేక్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Gwalior Rape Case: మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాయమాటలతో యువతిని గెస్ట్హౌస్కు పిలిపించిన వ్యక్తి.. అతని ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గ్వాలియర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన గ్వాలియర్ నగరంలో బుధవారం రాత్రి జరిగింది. నిందితులను లాలా, హిమాన్షు, అభిషేక్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గ్వాలియర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో యువతి (25) కి నిందితులలో ఒకరితో పరిచయమైంది. ఆపై ఇద్దరూ ఫోన్ నెంబర్లు మార్చుకుని చాటింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత వ్యాపారం గురించి మాట్లాడుకుందాం.. అంటూ యువతిని మభ్యపెట్టి గ్వాలియర్కు పిలిపించాడు. ఆ తర్వాత యువతిని గెస్ట్హౌస్లో ఉంచిన నిందితుడు.. అదే రోజు రాత్రి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గెస్ట్హౌస్కి వచ్చాడు. అనంతరం ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఆ తర్వాత పరారయ్యారని పోలీసులు తెలిపారు.
అక్కడి నుంచి బయటపడిన యువతి.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..