Karnataka: కర్ణాటకలో దారుణం.. అర ఎకరం భూమి కోసం ప్రాణాలు కోల్పోయిన నలుగురు సోదరులు
అర ఎకరం భూమి కోసం రెండు వర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అతి దారుణంగా హత్యకు గురయ్యారు.
Karnataka Family Murdered: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. రెండు కుటుంబాల ఘర్షణ ఓ కుటుంబాన్నే అంతం చేసింది. అర ఎకరం భూమి కోసం రెండు వర్గాల నడుమ జరిగిన ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అతి దారుణంగా హత్యకు గురయ్యారు. కర్ణాటకలోని బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా మధురఖండి గ్రామంలో శనివారం సాయంత్రం ఈ దారుణం వెలుగుచూసినట్లు బాగలకోటె పోలీసులు తెలిపారు. మృతులను అన్నదమ్ములైన బసవరాజ్ ముదరడ్డి (36), ఈశ్వర్ ముదరడ్డి (40), మల్లప్ప ముదరడ్డి (44), హనుమంత ముదరడ్డిగా (48) గుర్తించారు.
రెండు వర్గాల నడుమ అర ఎకరా భూమి కోసం పదేళ్లుగా వివాదం కొనసాగుతోంది. శనివారం ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు నలుగురు సోదరులపై దాడిచేశారు. మారణాయుధాలతో బలంగా కొట్టడంతో నలుగురు సోదరులు అక్కడికక్కేడ ప్రాణాలను కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసులో 12 మంది నిందితుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, పూటాని కుటుంబానికి చెందిన నందీష్, నాగప్ప, పరప్ప, శివానంద్, ఈరప్ప, శంకర్, అంబవ్వ, రుక్మవ్వ, మాలశ్రీ, సుందండ, ప్రేమ, చిన్నబసప్ప నిడోని ఈ నేరానికి పాల్పడినట్లు తెలిసింది. జమఖండి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also… Afghanistan Crisis: అఫ్ఘానిస్థాన్లో కొనసాగుతున్న తాలిబన్ల దాష్టీకాలు.. జానపద కళాకారుడు దారుణ హత్య
Pelli SandaD: రాఘవేంద్రరావు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న అప్పటి సౌందర్య లహరి..