మళ్లీ తెరపైకి హనీ ట్రాప్.. ఈసారి ఏమైందంటే..?
ప్రపంచదేశాలు ఉగ్రవాద నిర్మూలకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్లో గత నాలుగేళ్లుగా ఉగ్రవాదులు దేశంలో అడుగుపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నింటిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చారు. యువతే లక్ష్యంగా ప్లాన్ వేశారు. తమ ప్లాన్ను పక్కాగా అమలు చేసి.. బలం పెంచుకునే పనిలో పడ్డారు. ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించేందుకు ఆపరేషన్ హనీ ట్రాప్ను చేపట్టారు. ఇక తాజాగా హనీ […]
ప్రపంచదేశాలు ఉగ్రవాద నిర్మూలకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్లో గత నాలుగేళ్లుగా ఉగ్రవాదులు దేశంలో అడుగుపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నింటిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చారు. యువతే లక్ష్యంగా ప్లాన్ వేశారు. తమ ప్లాన్ను పక్కాగా అమలు చేసి.. బలం పెంచుకునే పనిలో పడ్డారు. ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించేందుకు ఆపరేషన్ హనీ ట్రాప్ను చేపట్టారు.
ఇక తాజాగా హనీ ట్రాప్ మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను హనీట్రాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు మహిళల ముఠా గుట్టును మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు బయటపెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పడి కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసిన బాగోతాన్ని ఇండోర్ పోలీసులు కనిపెట్టారు. వారికి అందిన సమాచారం ప్రకారం ఇండోర్ పోలీసులు హనీట్రాప్ చేసి డబ్బులు గుంజుతున్న ముగ్గురు మహిళలు, ఓ యువకుడిని అరెస్టు చేశారు. వీరు ముగ్గురు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తును మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది.
అసలు హనీ ట్రాప్ అంటే ఏంటి..?
హనీ ట్రాప్ అంటే అందమైన అమ్మాయిలను ఎరగా వేయడం. సోషల్ మీడియా వేదికగా చేసుకుని యువకులను, రాజకీయ నేతలను ముగ్గులోకి లాగడం. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉగ్రవాదులకు కావాల్సిన సహాయ సహకారాలు పొందటం. వీలైతే సైనిక రహస్యాలను తెలుసుకోవడం. ఫేస్ బుక్లో అమ్మాయిల పేరుతో పరిచయమై వారితో స్నేహం చేస్తారు. మెల్లగా ఉగ్రబాట వైపు వారిని మళ్లించే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా సంవత్సరం క్రితం జమ్ముకళ్మీర్కు షాదియానా అనే మహిళను అరెస్టు చేయడంతో ఉగ్రవాదుల ప్లాన్ ప్రపంచానికి తెలిసింది. బందీపురాకు చెందిన షాదియానా ఫేస్ బుక్ వేదికగా జీహాద్కు పనిచేస్తోంది. ఆయుధాలు చేతపట్టాలని యువకులను రెచ్చగొడుతోందని గుర్తించిన పోలీసులు ఉగ్రవాదుల సరికొత్త ప్లాన్కు ప్రారంభంలోనే చెక్ పెట్టారు. అయితే పాకిస్థాన్ కేంద్రంగా ఈ హనీ ట్రాప్లో ఇప్పటికే 1100 మంది భారత యువకులు చిక్కుకున్నట్లు గుర్తించారు. మొత్తం 13 ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా ఐఎస్ఐ వలపుల వల విసరడంతో ఆ 1100 మందిపై ఏటీఎస్ నిఘా పెట్టింది.
మరోసారి హనీ ట్రాప్ అంశం తెరపైకి రావడంతో ఉగ్రమూకలు భారత్లో అడుగుపెట్టేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నారా..? ఆ మధ్య పాకిస్థాన్, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇలా ఎక్కడడెక్కడ వారి కదలికలు మొదలయ్యాయి..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చూడాలి మరి.