Group Clashes: కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం.. రూ. 2 వేల కోసం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ.. పలువురికి తీవ్ర గాయాలు..
కృష్ణా జిల్లా గుడివాడలోని వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
Group Clashes: కృష్ణా జిల్లా గుడివాడలోని వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చేతికందిన దానితో పరస్పర దాడులకు పడ్డారు. ఈ పరస్పర దాడులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరు కేవలం రూ. 2వేలకు సంబంధించిన పాత లావాదేవీ అంశంపై ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం ఇరు వర్గాలు గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. కాగా, ఈ ఘర్షణలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు.. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న గుడివాడ 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందనే దానిపై ఇరు వర్గాల వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Also read: