ఒడిషాలో భారీగా పట్టుబడ్డ గంజాయి.. ఇద్దరు అరెస్ట్
ఒడిషాలో భారీగా గంజాయి పట్టుబడింది. కరాపుట్ జిల్లాలోని జెయ్పొరే పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు..
ఒడిషాలో భారీగా గంజాయి పట్టుబడింది. కరాపుట్ జిల్లాలోని జెయ్పొరే పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. వెయ్యి కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెయ్పొరే పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపడుతుండగా.. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి 1,046కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని సంచుల్లో ప్యాక్ చేసి తరలిస్తున్న వాటిని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Two people have been apprehended and 1,046 kgs of ganja seized from their possession under Jeypore Police Station limits in Koraput district of Odisha. A case has been registered: Special Task Force pic.twitter.com/poJUkpZmWj
— ANI (@ANI) August 21, 2020
Read More :