కందకంలో పడిన చిన్నారి మృతి…నెల్లూరులో విషాదం
నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కందకంలో పడిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు చనిపోయారు. గోపిరాజ్ ప్రాణాలతో బయటపడగా..మోక్షిత తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోక్షత స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల కాగా.. నెల్లూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. పక్కింట్లో ఉండే గోపిరాజ్తో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కందకంలో పడిపోయారు. గుంతలో పడిన గంట తర్వాత బాలుడిని స్థానికులు బయటకు తీయగా.. మోక్షత కోసం అధికారులు సహాయక […]
నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కందకంలో పడిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు చనిపోయారు. గోపిరాజ్ ప్రాణాలతో బయటపడగా..మోక్షిత తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోక్షత స్వస్థలం ప్రకాశం జిల్లా చీరాల కాగా.. నెల్లూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. పక్కింట్లో ఉండే గోపిరాజ్తో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కందకంలో పడిపోయారు.
గుంతలో పడిన గంట తర్వాత బాలుడిని స్థానికులు బయటకు తీయగా.. మోక్షత కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గుంతకు సమాంతరంగా జేసీబీతో మట్టిని తవ్వారు. రెండు గంటల అనంతరం ఆ పాపను బయటకు తీసుకొచ్చారు. ఐతే శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉండడంతో ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ఆ చిన్నారని చనిపోయింది. చిన్నారులు సురక్షితంగా బయట పడ్డారన్న ఆనందం గ్రామస్థుల్లో ఎంతోసేపు నిలవలేదు.