AP News: ఆమెను వేధిస్తున్నాడనే కోపంతో.. కన్న కొడుకునే చంపిన తండ్రి.. అల్లుడితో కలిసి..
ప్రియాంక తరచు పుట్టింటికి వెళ్లడం ఆమె తల్లిదండ్రులు సర్ది చెప్పి భర్త ఏసురత్నం దగ్గర వదిలి వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఏసురత్నంలో మార్పు ఏమైనా వస్తుందేమో అని సెక్యూరిటీ గార్డుగా జాయిన్ చేశారు.
Andhra Pradesh: ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఏదుబాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసై తరచు ఇంట్లో గొడవలు పెడుతున్న కొడుకును కన్న తండ్రే కడతేర్చాడు. ఇందుకు అల్లుడు సహకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (Bapatla district) ఏదుబాడు గ్రామానికి చెందిన పొనుగుపాటి ఏసురత్నం( 28) నీలిమా ప్రియాంక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా కొన్నాళ్లు పాటు అంత సజావుగానే నడిచింది. అయితే ఏసురత్నం మద్యానికి బానిసగా మారి తరచూ.. భార్య ప్రియాంకని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రియాంక తరచు పుట్టింటికి వెళ్లడం ఆమె తల్లిదండ్రులు సర్ది చెప్పి భర్త ఏసురత్నం దగ్గర వదిలి వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఏసురత్నంలో మార్పు ఏమైనా వస్తుందేమో అని ఇటీవల విజయవాడలోని ఓ ప్రేవేట్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా జాయిన్ చేశారు. కాగా అతనిలో ఎటువంటి మార్పు లేదు.
యధావిధిగానే ఏసురత్నం పుల్లుగా మద్యం సేవించి భార్యను కొట్టడం, వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భార్య ప్రియాంక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో భార్యను తన దగ్గరికి తీసుకురావలంటూ ఏసురత్నం తన తండ్రి బాపయ్య దగ్గరికి వచ్చి కోరాడు. దీంతో ఏసురత్నంకు తండ్రి బాపయ్యకు మధ్య కొద్దిపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఇది కాస్త పెద్దది కావడంతో బాపయ్య, ఆయన అల్లుడు పూర్ణ చంద్రరావు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. ఏసురత్నం ఎంతకు వినకుండా.. ఘర్షణకు దిగడంతో.. క్షణికవేశనికి గురైన బాపయ్య, పూర్ణ చంద్రరావు పక్కనే వున్న ఓ రాడ్డుతో దాడి చేశారు. అయితే తీవ్ర గాయమైన ఏసురత్నం ఘటన స్థలంలోనే కుప్పకూలిపోయి మృతిచెందాడు.
కాగా విషయం తెలుసుకున్న పర్చూరు పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని విచారణ చేపట్టారు. మృతుని బార్య, నీలిమ ప్రియాంక ఫిర్యాదు మేరకు పర్చూరు యస్ఐ లక్మీ భవాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.