Drugs: సూప్ మిక్స్ ప్యాకెట్లల్లో 7లక్షల డ్రగ్స్.. చెన్నై విమానాశ్రయంలో పార్సిల్ స్వాధీనం..
Chennai airport: డ్రగ్స్ సరఫరాదారులు రకరకాల ప్లాన్లతో సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు నిత్యం పెద్ద ఎత్తున డ్రగ్స్ను పట్టుకుంటున్న...
Chennai airport: డ్రగ్స్ సరఫరాదారులు రకరకాల ప్లాన్లతో సరఫరా చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు నిత్యం పెద్ద ఎత్తున డ్రగ్స్ను పట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సారి డ్రగ్స్ సరఫదారులు వేసిన ప్లాన్కు అధికారులు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారు. రెడీమేడ్ సూప్ మిక్స్ ప్యాకెట్ల నేపంతో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా.. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం నెదర్లాండ్ నుంచి చెన్నైకి ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా వచ్చిన పార్సెల్లో డ్రగ్స్ ఉన్నట్లు అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. అనంతరం సూప్ మిక్స్ పాకెట్లల్లో డ్రగ్స్ టాబ్లెట్స్తో పాటు మెత్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ 7 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అనంతరం కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి పోస్ట్ పార్సెల్లో ఉన్న వివరాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఆ చిరునామాలు నకిలీవిగా గుర్తించారు. ఈ డ్రగ్ రాకెట్ వెనుక విదేశీ కుట్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
Also Read: