అమలాపురంలో విషాదం.. వైద్యుని కుటుంబం ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ వైద్యుని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలో మంచి పేరున్న ఆర్దోపెడిక్ వైద్యుడు పెనుమెత్స రామకృష్ణరాజు( 48), ఆయన భార్య లక్ష్మీ దేవి( 45), కుమారుడు కృష్ణ సందీప్ ( 25) ఈ ముగ్గురు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. రామకృష్ణ రాజు గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం. అందులో భారీగా నష్టాలు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడి […]

అమలాపురంలో విషాదం..  వైద్యుని కుటుంబం ఆత్మహత్య
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 8:09 PM

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ వైద్యుని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పట్టణంలో మంచి పేరున్న ఆర్దోపెడిక్ వైద్యుడు పెనుమెత్స రామకృష్ణరాజు( 48), ఆయన భార్య లక్ష్మీ దేవి( 45), కుమారుడు కృష్ణ సందీప్ ( 25) ఈ ముగ్గురు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. రామకృష్ణ రాజు గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం. అందులో భారీగా నష్టాలు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యలకు కారణాలుగా భావిస్తున్నారు. పాయిజన్‌ ఇంజక్షన్‌ తీసుకోవడంతో ముగ్గురూ ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.