పాడేరు బస్సు బోల్తా.. ముగ్గురు మృతి..
విశాఖ జిల్లా పాడేరు మండలం వద్ద టూరిస్ట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 37 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పాడేరు మండలం వంట్లమామిడి ఘాట్రోడ్డులో సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడడంతో సహాయక చర్యలు అందక క్షతగాత్రులు నానా అవస్థలు పడ్డారు. బాధితులను తూర్పుగోదావరి జిల్లా […]
విశాఖ జిల్లా పాడేరు మండలం వద్ద టూరిస్ట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 37 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పాడేరు మండలం వంట్లమామిడి ఘాట్రోడ్డులో సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్షం పడడంతో సహాయక చర్యలు అందక క్షతగాత్రులు నానా అవస్థలు పడ్డారు. బాధితులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందినవారిగా గుర్తించారు. వీరు ఒడిశా రాయ్గఢ్లోని మజ్జిగౌరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.