Crime News: పెళ్లి కొడుకు సందేహం.. మనస్తాపానికి గురైన నూతన వధువు.. అందరూ ఉండగానే ఇంట్లోకి వెళ్లి..
హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్ళై కాలికి పారాణి కూడా ఆరక ముందే ఓ నవ వధువు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్ళై కాలికి పారాణి కూడా ఆరక ముందే ఓ నవ వధువు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం, బొట్టు చెరువు గ్రామనికి చెందిన సాక స్వామి ప్రగతి నగర్లో నివసిస్తున్నారు. స్వామి తన పెద్ద కుమార్తె సౌజన్యకు, గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న వేంకటేశ్వర రావుకి ఇచ్చి ఈ నెల 6వ తేదీన వివాహం జరిపించారు. వివాహం అనంతరం శోభనం కోసం 9వ తేదీన ఏర్పాట్లు చేశారు. కానీ 10వ తేదీన ఉదయం, సౌజన్య భర్త వేంకటేశ్వర రావు, తమకు శోభనం జరగలేదని, వధువు నిరాకరణకు కారణం తెలుసుకోవాలని సౌజన్య తల్లిదండ్రులకు తెలిపాడు. ఇదే విషయమై మనస్తాపానికి గురైన సౌజన్య, గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరివేసుకుంది. సౌజన్య తలుపు తీయకపోవటంతో కుటుంబ సభ్యులు ఆ తలుపులను పగులగొట్టి లోనికి వెళ్ళారు. ఉరికి వేలాడుతున్న సౌజన్యను కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. సౌజన్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సౌజన్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.