డబ్బులు దొంగిలించావని భార్యపై కత్తితో దాడి.. ఆపై మూడు గంటలు గదిలోనే బంధించి చిత్రహింసలు..

తన జేబులోంచి డబ్బులు దొంగిలించిందని ఆరోపణలు చేస్తూ భార్య అని కూడా చూడకుండా కూరగాయల కత్తితో కడుపులో పొడిచాడు ఓ దుర్మార్గుడు. ప్రేమించి పెళ్లిచేసుకొని ఇప్పుడు పశువులా ప్రవర్తిస్తున్నాడు..

డబ్బులు దొంగిలించావని భార్యపై కత్తితో దాడి.. ఆపై మూడు గంటలు గదిలోనే బంధించి చిత్రహింసలు..
Follow us

|

Updated on: Nov 28, 2020 | 1:34 PM

తన జేబులోంచి డబ్బులు దొంగిలించిందని ఆరోపణలు చేస్తూ భార్య అని కూడా చూడకుండా కూరగాయల కత్తితో కడుపులో పొడిచాడు ఓ దుర్మార్గుడు. ప్రేమించి పెళ్లిచేసుకొని ఇప్పుడు పశువులా ప్రవర్తిస్తున్నాడు..అదనపు కట్నం కోసం వేధిస్తూ రాచి రంపాన పెడుతున్నాడు. నిజమాబాద్ జిల్లా డిచ్‌పల్లి దగ్గరలోని ఓ తండాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నడిపల్లి తండాకు చెందిన రాథోడ్ దివ్య, కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన రాథోడ్ రాజు నాలుగేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కలిసి ఘన్‌పూర్‌లో ఉంటున్నారు. రాజు పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఫంక్షన్ వెళ్లిన దంపతులు అక్కడ అనుకోకుండా గొడవపడ్డారు. అనంతరం మరునాడు ఉదయం తన జేబులో డబ్బులు కనిపించడం లేదని, నువ్వే తీశావని చెప్పి దివ్యను విచక్షణా రహితంగా కొట్టి కూరగాయలు కోసే కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తసావమవగా తనే ఒక టవల్‌తో కట్టుకట్టి మూడు గంటలు ఇంటిలోనే బంధించి రాక్షసానందం పొందాడు. తర్వాత జరిగిన విషయం తన తమ్ముడికి కాల్ చేసి చెప్పడంతో అతడు దివ్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే దివ్య తల్లి, కొడుకు కోడలితో ఘన్‌పూర్‌ చేరుకొని కూతురిని డిచ్‌పల్లి ఆస్పత్రికి తరలించింది. అంతేకాకుండా దుర్మార్గుడైన అల్లుడిని పారిపోకుండా ఇంట్లో పెట్టి తాళం వేసి పోలీసులకు పట్టించింది. రాథోడ్ రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.