షాకింగ్.. లాక్డౌన వేళ మహిళపై బీజేపీ నేత అత్యాచారయత్నం..
దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. అసోంకి చెందిన బీజేపీ మైనార్టీ మోర్చ నేత అత్యాచార ఆరోపణల నేపథ్యంలో జైలుపాలయ్యాడు. స్థానికంగా ఉండే ఓ మహిళ అత్యాచార యత్నం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. తనపై హోజోయి పట్టణానికి చెందిన బీజేపీకి చెందిన నాయకుడు కమరుల్ హఖ్ చౌదరి అత్యాచారానికి యత్నించారని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 376,511 కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని […]
దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. అసోంకి చెందిన బీజేపీ మైనార్టీ మోర్చ నేత అత్యాచార ఆరోపణల నేపథ్యంలో జైలుపాలయ్యాడు. స్థానికంగా ఉండే ఓ మహిళ అత్యాచార యత్నం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. తనపై హోజోయి పట్టణానికి చెందిన బీజేపీకి చెందిన నాయకుడు కమరుల్ హఖ్ చౌదరి అత్యాచారానికి యత్నించారని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 376,511 కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని అడిషనల్ ఎస్పీ సుమన్ చక్రవర్తి తెలిపారు. నిందితుడు కమరుల్ను అరెస్ట్ చేసి.. శంకర్ దేవ్ నగర్ కోర్టులో హాజరుపర్చామని తెలిపారు. న్యాయమూర్తి అతడిని రిమాండ్కు తరలించారని పేర్కొన్నారు.
కాగా, కమరుల్ హఖ్ చౌదరి బీజేపీలో మైనార్టీ మోర్చా నాయకుడిగా ఉన్నారు. అయితే మహిళపై అత్యాచారయత్నం చేసిన ఆరోపణల నేపథ్యంలో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అసోం బీజేపీ ప్రకటించింది.