55 ఏళ్ల తర్వాత విమానప్రమాదపు ఆసక్తికరమైన అవశేషం దొరికింది

వియెన్నాలో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న హోమీబాబాను అమెరికానే కుట్రపూరితంగా చంపేసి ఉంటుందని ఇప్పటికీ చాలామంది బలంగా నమ్ముతుంటారు

55 ఏళ్ల తర్వాత విమానప్రమాదపు ఆసక్తికరమైన అవశేషం దొరికింది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 13, 2020 | 2:30 PM

అది 1966వ సంవత్సరం, జనవరి 24వ తేదీ… ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 707 విమానం ముంబాయి నుంచి న్యూయార్క్‌ నగరానికి బయలుదేరింది.. ఫ్రాన్స్‌ ఇటలీల సరిహద్దులలో ఉన్న మోంట్‌బ్లాంక్‌ దాటే సమయంలో కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 117 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఈ ప్రమాదం గురించి ఇప్పటివారికి తెలియకపోవచ్చు కానీ అప్పట్లో ఈ ప్రమాదం పెను సంచలనాన్ని రేపింది.. కారణం ఆ విమాన ప్రమాదంలో భారత అణు పితామహుడు హోమీ బాబా కూడా మరణించడం .. ఇది అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ పనేనన్న అనుమానాలు వచ్చాయి.. వియెన్నాలో జరిగే ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న హోమీబాబాను అమెరికానే కుట్రపూరితంగా చంపేసి ఉంటుందని ఇప్పటికీ చాలామంది బలంగా నమ్ముతుంటారు.. ఇందుకు సంబంధించి కొన్ని రుజువులను కూడా కొందరు సంపాదించారు.. అంతకు ముందు

1950లో కూడా ఎయిర్‌ ఇండియా విమానం ఇదే పర్వత ప్రాంతంలో కూలిపోయింది.. ఆ దుర్ఘటనలో 48 మంది కన్నుమూశారు. ఈ రెండు ప్రమాదాలు జరిగినప్పుడు ఆవశేషాల గుర్తించడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి.. మూడేళ్ల కిందట కొన్ని మానవ శకలాలను ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్‌ పర్వతాలపై గుర్తించారు.. ఆల్ఫ్స్‌ పర్వతాల్లోని మాంట్‌ బ్లాక్‌ హిమానీ నదం కరుగుతున్నప్పుడల్లా ఆ విమానప్రమాదాలకు సంబంధించిన రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి.. .. ఇప్పుడు మళ్లీ 1966లో జరిగిన ప్రమాదానికి సంబంధించి కొన్ని కొన్ని అవశేషాలు దొరికాయి.. తాజాగా 1966 నాటి నేషనల్‌ హెరాల్డ్‌, ది ఎకనామిక్‌ టైమ్స్‌ న్యూస్‌ పేపర్ల కట్టలు దొరికాయి. అప్పుడు విమాన ప్రమాదం జరిగినప్పుడు ఈ వార్త పత్రికల కట్టలు నదిలో పడి ఉంటాయని అనుకుంటున్నారు.. 55 ఏళ్లు దాటినప్పటికీ ఈ వార్త పత్రికలు ఏ మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం.

తిమోతీ మోటిన్‌ అనే రెస్టారెంట్ యజమానికి ఈ న్యూస్‌ పేపర్లు దొరికాయి.. చామోనిక్స్‌ స్కీయింగ్‌ హబ్‌ సమీపంలో లా కాబెన్‌ డు సెరో అనే కాఫీ రెస్టారెంట్‌ను తిమోతీ మోటిన్‌ నడుపుతున్నాడు.. బోసన్స్‌ హిమానీ నదానికి దగ్గర్లోనే ఉంది ఈ రెస్టారెంట్‌.. ఈ పేపర్లు దొరికినందుకు పెద్ద నిధి చేతికందినంతగా తెగ హాప్పీ ఫీలవుతున్నాడు తిమోతి.. పేపర్లు ఎండిన తర్వాత చక్కగా చదువుకోవచ్చని చెబుతున్న తిమోతీ వాటిని సందర్శనకు కూడా పెడతానంటున్నాడు. ఆ పేపర్లలో ప్రధానవార్త ఇందిరాగాంధీ గురించి కావడం, ఇందిరాగాంధీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అన్నది పతాకశీర్షిక కావడం విశేషం..