ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం..

మానవ రూపంలో ఉన్న మృగం రెచ్చిపోయింది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని చిదిమేసింది. మనవరాలు వయసు కలిగిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.

ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం..
Follow us

|

Updated on: Sep 24, 2020 | 2:19 PM

మానవ రూపంలో ఉన్న మృగం రెచ్చిపోయింది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని చిదిమేసింది. మనవరాలు వయసు కలిగిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఆరేళ్ల చిన్నారిని 50 ఏళ్ల వ్యక్తి అపహరించి.. ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. భిక్షాటన చేసుకుంటూ జీవించే కుటుంబానికి చెందిన చిన్నారి మంగళవారం పేరేచర్ల జంక్షన్‌కు వచ్చింది. రాత్రి అయినా పాప ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేరేచర్ల జంక్షన్‌లోని సీసీకెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని అపహరించి తీసుకెళ్లినట్లు గుర్తించారు. చుట్టు పక్కల వెతుకుతుండగా.. రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా కూర్చొని పాప ఏడుస్తూ పోలీసులకు కనిపించింది. ఏం జరిగిందని వాకబు చేసిన పోలీసులకు ఆ కసాయి చేసి అకృత్యాన్ని వివరించింది. బాలికను వైద్య చికిత్స కోసం గుంటూరు జనరల్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీంతో నిందితుడిని గుంటూరు రూరల్‌ నల్లపాడుకు చెందిన స్వామిగా బుధవారం సాయంత్రం పోలీసులు గుర్తించారు. పాపకు మాయమాటలు చెప్పి రైల్వేస్టేషన్‌ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. స్వామిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మేడికొండూరు సీఐ తెలిపారు.