Hyderabad: ఔటర్‌ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..

ఔటర్‌ రింగ్‌ రోడ్డు (outer ring road) పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు.

Hyderabad: ఔటర్‌ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..
Road Accident
Follow us

|

Updated on: Jul 04, 2022 | 7:56 PM

Hyderabad Road Accident: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శంషాబాద్‌ మండలం పెద్ద గోల్కొండ వద్ద జరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (outer ring road) పై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన బాధితులను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు.

అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులు హయత్‌నగర్‌ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..