Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టెంపో ఢీకొని 17 మంది దుర్మరణం.. పలువురి పరిస్థితి..

UP Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని కాన్పూర్‌ సమీపంలోని సంచెంది వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టెంపో ఢీకొని 17 మంది దుర్మరణం.. పలువురి పరిస్థితి..
Road Accident
Follow us

|

Updated on: Jun 09, 2021 | 6:31 AM

UP Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. రాష్ట్రంలోని కాన్పూర్‌ సమీపంలోని సంచెంది వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సచెంది వద్ద  ఓ బస్సు టెంపోను ఢీకొంది. దీంతో దీంతో 17 మంది మృతి చెందినట్లు కాన్పూర్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు. నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనాస్థలంలోనే చాలామంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టెంపోలో కూడా ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదం విషయం తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు యూపీ ప్రభుత్వం రూ.రెండు లక్షల పరిహారం ప్రకటించింది. తక్షణమే ప్రమాదంపై విచారణ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. రెండు లక్షల పరహారం, గాయపడినవారికి  రూ.50,000 చొప్పున ప్రధాని మోదీ ప్రకటించారు.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ గోల్డ్ రేట్స్..

UPI Money Transfer: పొరపాటున మీ డబ్బును ఇతరుల అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారా?.. ఇలా తిరిగి పొందండి..!