Crime News: పెళ్లికి నిరాకరించారని.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..!

నిజామాబాద్‌ జిల్లాలో దారుణ చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం అలీసాగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెళ్లి విషయంలో ఇరుకుటుంబాలు అంగీకరించలేదనే మనస్థాపంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టు

Crime News: పెళ్లికి నిరాకరించారని.. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..!
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 7:24 AM

Crime News: నిజామాబాద్‌ జిల్లాలో దారుణ చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం అలీసాగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెళ్లి విషయంలో ఇరుకుటుంబాలు అంగీకరించలేదనే మనస్థాపంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్‌ ఉద్యానవనం ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన 21ఏళ్ల యువతి, జహీరాబాద్‌కు చెందిన 23ఏళ్ల యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ వారి కుటుంబాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

హైదరాబాద్‌లో వీరిద్దరూ చదువుకొనేటప్పుడు ప్రేమ చిగురించిందని, పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతోనే వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్నేహితులు అలీసాగర్‌ ఉద్యానవన పరిసర ప్రాంతాల్లో గాలించారు. చివరకు ఉద్యానవనంలోనే వారు పురుగులమందు తాగి అపస్మారక స్థితిలో ఉండటాన్ని యువకుడి స్నేహితులు గుర్తించారు. వెంటనే వారిని ఆటోలో నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మృతి చెందగా..యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.